కేజీ కూరగాయలు 10₹లకే 9రకాల విక్రయం
న్యూస్ ఫోర్స్, నెల్లూరు:రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల ఆదేశాలు మేరకు,వైసీపీ యువజన జిల్లా అధ్యక్షుడు రూప్ కుమార్ యాదవ్, రూరల్ నియోజకవర్గ కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి,నెల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఏసు నాయుడు ప్రోద్భలంతో 10వ డివిజన్ నాయకులు శివారెడ్డి,గండి కోట శ్రీనివాసులు( ఏసీ కూరగాయల మార్కెట్ షాప్ నెం-డి24)ల ఆధ్వర్యంలో కేజీ కూరగాయలు 10₹లకే 9రకాలను విక్రయించారు.స్థానిక 10వ డివిజన్ లోని రామచంద్రాపురం,బాబు గిరిజన కాలనీ లో సుమారు600మంది ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు.రైతు బజార్లు రేట్ల కంటే అతి తక్కువ ధరలకే ప్రజలకు అందుబాటులో అందిస్తున్న మార్కెట్ శ్రీనివాసులును ఈ సందర్భంగా శివారెడ్డి అభినందించారు.ఈ కార్యక్రమంలో పుట్టబోయిన వెంకటేశ్వర్లు యాదవ్, ఏలూరు సురేష్, మునిచంద్ర, పెంచల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#